Friday, April 26, 2024
- Advertisement -

పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ

- Advertisement -

ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్ పై తన పగ తీర్చుకోవడానికి పాక్ అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంతర్జాతీయంగా ఒంటరి కావడంతో భారత్ లోకి ఉగ్రవాదులను పంపిస్తూ….మరో వైపు సరిహద్దులో తరచూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఇలా తరుచూ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాక్ కు ఇండియన్ ఆర్మీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని పాక్ టెర్రర్ లాంఛ్ ప్యాడ్లను, శిబిరాలను సోమవారం భారత సైన్యం ధ్వంసం చేసింది.. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఈ లోయ ఉండగా, అక్కడ టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నట్టు సమాచారాన్ని అందుకున్న సైన్యం, వాటిని నాశనం చేసింది. పాక్ ఆర్మీ పోస్టులకు ఈ లాంచ్ పాడ్ అత్యంత సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది.కాగా, పాకిస్థాన్ సైన్యం భారత్‌లోకి ఉగ్రవాదులను చొప్పించేందుకు ఈ శిబిరాలను వాడుతుండటం గమనార్హం

జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, లాంటి ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో శిక్షణా శిబిరాలను నడుపుతున్నాయి. వీటికి పాకిస్థాన్ సైన్యమే పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే జలమార్గం గుండా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో దేశంలోని భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -