- Advertisement -
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకు మధ్య గత కొంత కాలంగా దూరం పెరిగిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కొన్ని రోజులుగా ప్రభుత్వంతో కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.
రిజర్వ్ బ్యాంకు నిల్వలను తమకు ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ ప్రతిపాదనను ఆర్బీఐ గవర్నర్ తో పాటు పలువురు ఆర్థికవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం నాడు ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2016 నుండి ఆర్బీఐ గవర్నర్ గా పనిచేస్తున్నారు.