Saturday, April 27, 2024
- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌లో గెలుపు కాయం..అంటున్న టీడీపీ శ్రేణులు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక మ‌రింత కాకా పుట్టిస్తోంది.గెలుపుకోసం బాబు తీవ్రంగా కృషిచేస్తున్నారు.ఇప్ప‌టికే మంత్రులు నంద్యాల‌లో మ‌కాం వేసి ఎన్నిక‌ల ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తున్నారు.గెలుపు బాధ్య‌త అంతా మంత్రుల‌మీద‌నే వేశారు.ఇప్పుడు ఐటీ మంత్రి లోకేష్ నంద్యాల రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు వెల్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌పై మంత్రి నారాలోకేష్ దృష్టిసారించారు.అందుకే13, 14 తేదీల్లో ప్రత్యేకించి లోకేష్ మొదటిసారిగా నంద్యాలలో పర్యటిస్తున్నారు. నియోజకవర్గంలోని నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియలు చేస్తున్న ప్రచారం సరళి, జనాల రెస్పాన్స్ ను పరిశీలిస్తారట. మంత్రులు, నేతలతో సమన్వయం చేసేందుకే లోకేష్ నంద్యాలకు వెళుతున్నారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

చంద్రబాబునాయుడు తరపున లోకేష్ నియోజకవర్గ బాధ్యతలను మోస్తున్నారు. గడచిన మూడేళ్ళుగా నియోజకవకవర్గంలో అమలు చేసిన పథకాలు, మొన్ననే ఉపఎన్నిక కోసం మంజూరు చేసిన నిధులు, కావాల్సిన నిధులు తదితరాలపై కూడా లోకేష్ మంత్రులు, నేతలతో మాట్లాడుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయ్.చిన‌బాబు ప‌ర్య‌ట‌న‌తో టీడీపీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహం రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -