- Advertisement -
నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం వీగిపోయిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబును టార్గెట్ చేశారు భాజాపా నేతలు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసానికి రెడీ అవుతున్నారు. అందుకు నిదర్శనం ఆపార్టీ ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.
అవిశ్వాసం వీగిపోవడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పారు. టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ ల స్నేహ బంధానికి లోక్ సభ వేదికగా నిలిచిందని అన్నారు. వైసీపీ సహకరిస్తే, టీడీపీపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధమని చెప్పారు.