Friday, April 26, 2024
- Advertisement -

మహేష్ కోసం జగన్ ఎదురు చూపులు.. నిజమేనా ?

- Advertisement -

ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన ఫోకస్ చేస్తోంది. 40 ఏళ్ల కుర్రాడు అప్పులో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు అది ఎలా సాధ్యం అనుకునేవారు చాలామంది జాతీయ నాయకులు ఉన్నారు. మరి కొందరు జగన్ ను ఫాలో అవుతున్నారు. ఏపీలో అయితే జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి అభినందిస్తున్నారు. అయితే జగన్ అంటే పడని వారు కూడా జగన్ ను తప్పుపడుతున్నారు.

తాజాగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ భాగంగా మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో జగన్ అభిమానించే వారి సంఖ్య పెరిగింది. టీడీపీ నాయకులు సైతం జగన్ కు జై కొడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. విశాఖను ఎక్సిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత జగన్ తొలి సారి అక్కడికి వచ్చారు. అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా సాంగ్ లాంచ్ చేశారు.

వాస్తవానికి ఈ సాంగును జగన్ తో లాంచ్ చేయించాలని చూశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఇండస్ట్రీలో మహేష్ టాప్ హీరో కావడంతో ఆయన పై జగన్ చూపులు పడ్డాయని అంటున్నారు. ఆయన వైసీపీ లోకి వస్తే ప్రభుత్వం టూరిజం శాఖకు బ్రాండ్ అంబాసిడర్ నియమనించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -