Friday, April 26, 2024
- Advertisement -

వైసీపీలో చేరిన సినీన‌టి జ‌య‌సుధ‌..

- Advertisement -

తెలుగు దేశం పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. వైసీపీలోకి వ‌స‌లు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే, సినీన‌టి జ‌య‌సుధ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్ నివాసంలో ఆమె గురువారం భేటీ అయ్యారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. వైసీపీలోకి రావడం తన స్వంత ఇంటికి వచ్చినట్టుగా ఉందని ఆమె చెప్పారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం లేదన్నారు. సినీ రంగానికి చెందిన వాళ్లు జగన్‌‌ను కలవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్సార్ సీపీలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉంద‌ని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -