Friday, April 26, 2024
- Advertisement -

కేసీఆర్ హెచ్చరించినా బాబు వినలేదా.?

- Advertisement -

ఎవరి నమ్మకాలు వారివి.. నమ్మినవారు అధికారంలో ఉన్నారు.. నమ్మని వారు ఓడి ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే దేవుడు, వాస్తు, జ్యోతిష్యం ఇలా అన్నింటిని బాగా నమ్మే కేసీఆర్ తూచా తప్పకుండా పాటిస్తూ విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఇవన్నీ పట్టని బాబు నాస్తికత్వంతో ఓడిపోయారన్న చర్చ ఇప్పుటు టీడీపీ సీనియర్లలో సాగుతోందట..

క్రిస్టియనాటినీ స్వీకరించినా వైఎస్ జగన్ హిందుత్వ శారదాపీఠాధిపతికి అగ్రతాంబూలం వేసి ఆయన చెప్పినట్టు యాగాలు, తేదీల నాడే మొదలుపెట్టి అధికారం పీఠం అధిరోహించారు. ఇలా యువకుడైన జగన్ నమ్మిన సిద్ధాంతాలను కూడా బాబు నమ్మడం లేదని టీడీపీ సీనియర్లలో ఒకటే ఆవేదన అట.

తాజాగా కేసీఆర్ ముందుగా హెచ్చరించినా బాబు పెడచెవిన పెట్టిన వైనాన్ని చంద్రబాబుకు గుర్తు చేశారట టీడీపీ నేతలు. వరుసగా బాబు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాస్తు ప్రకారం లేని ప్రస్తుతం ఉండవల్లిలోని చంద్రబాబు అద్దెకుంటున్న నివాసం మంచిది కాదని ఆనాడే కేసీఆర్ చెప్పారని.. కానీ బాబు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారని చెప్పారట.. బాబు ఓటమిపై రివ్యూలో ఈ విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది.

సహస్ర చండీయాగానికి ఏపీ సీఎంగా ఉన్న నాడు ఉన్న చంద్రబాబును ఆహ్వానించడానికి కేసీఆర్ ఉండవల్లిని బాబు నివాసానికి వచ్చాడట.. పోతూ పోతూ పరిసరాలు కలియతిరిగి ఇది గుంటలో ఉందని.. ఇక్కడే ఉంటే ఓటమి ఎదురవుతుందని.. వాస్తు సరిగా లేని ఇంట్లో బాబు ఎందుకు ఉన్నాడని కేసీఆర్ హెలిక్యాప్టర్ ఎక్కి హైదరాబాద్ వెళ్లబోతూ తనను సాగనంపేందుకు వచ్చిన టీడీపీ నేతలతో అన్నాడట.. ఇప్పుడు జగన్ నోటీసులు ఇచ్చి బాబు ఇంటిని కూలగొడుతున్న నేపథ్యంలో ఈ ఇంటిని ఖాళీ చేస్తేనే బెటర్ అని టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచించారట.. మరి నమ్మకాలు పట్టని బాబు ఎలా వ్యవహరిస్తాడన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -