గురవింద తన నలుపు ఎరుగనట్లు జేనసేన అధ్యక్షుడు పవన్ వ్యవహరిస్తున్నా తీరు ఆందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నికల ప్రచారంలో తెలంగాణాపై పవన్ చేసిన అణుచిత వ్యాఖ్యలను చూసి ఆయన అభిమానులు, ప్రజలు నవ్వుకుంటున్నారు. పవన్కు సోయ ఉండి మాట్లాడుతున్నారో లేక గెలుపు కోసం మాట్లాడుతున్నారో జనసైనికులకే అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణాలో సభ నిర్వహిస్తున్న సమయంలో అక్కడి ప్రజలు కొంత మంది తనను కొట్టడానికి వచ్చారంటూ ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆవ్యాఖ్యలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ గట్టిగా ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ, తెలంగాణలో దేశంలోని 29 రాష్ట్రాల ప్రజలు స్వేచ్ఛగా, సంతోషంగా జీవిస్తున్నారని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్థ రాహిత్యం అని, పవన్ కళ్యాణ్ ఆలోచన సరళి మార్చుకోవాలని హితవు పలికారు. అసలు తెలంగాణా ప్రజల్లో పవన్ చెప్పేంత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర ప్రజల పట్ల ద్వేషం ప్రస్తుతం ఎక్కడా కనిపించదు, ఒక్క రాజకీయాల్లో తప్ప. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన ఓ వ్యక్తి తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం సరికాదని కేటీఆర్తో పాటు పలువురు పవన్కు హితవు పలుకుతున్నారు.