Friday, April 26, 2024
- Advertisement -

వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..!

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీడియా సమావేశమై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మాటలు చూస్తుంటే వంటికి టెన్ థౌజండ్ వాలా టపాసులు చుట్టుకుని.. మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా అవే టపాసులు చుట్టి పేల్చుతున్నట్టుగా ఉందని.. ఇది చాలా ప్రమాదకరమని.. అందరూ కాలిపోతారు జాగ్రత్తని హెచ్చరించారు.

జగన్ గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. అలా మాట్లాడొద్దని.. అలానే జగన్ ను చూసుకుని మిగితా ఎమ్మెల్యేలు కూడా రెచ్చిపోతున్నారని.. అది మంచిది కాదని అన్నారు. శివుడి మెడలో పాము ఉన్నంతవరకు గౌరవం.. అలానే జగన్ పరిస్థితి తారుమారైతే మీ పరిస్థితి కూడా అంతే అన్నట్లు పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందే భాషా ప్రయుక్త ప్రాతిపదికన అని.. ఆ విషయంను మీకు తెలుసా ? లేదా ? అని జగన్ ను ప్రశ్నించారు.

“నేను ఎప్పుడూ కూడా మీ వ్యక్తిగతం గురించి వ్యాఖ్యలు చేయలేదు. మీ ఎమ్మెల్యేలపై కూడా ఏనాడు వ్యక్త్గిగతంగా విమర్శించలేదు. కానీ ఓ స్థాయి దాటితే.. ఎలా మాట్లాడాలో నాకు బలంగా తెలుసు. అయితే సంయమనం పాటిస్తున్నాను” అంటూ ఘాటు కామెంట్స్ చేశారు. అలానే తనపై జగన్ చేసిన మూడు పెళ్లిళ్లు.. ఐదుగురు పిల్లల వ్యాఖ్యలను కూడా ప్రస్తావించాడు. “ఏం జగన్ రెడ్డి గారు.. నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు.. విజయసాయిరెడ్డిగారు కలిసి జైల్లో కూర్చున్నారా ?.. నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దు” అంటూ హెచ్చరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -