తెలంగాణా ఎన్నికల ఫలితాలలో కారు స్పీడ్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఓట్ల లెక్కింపులు చూస్తే టీఆర్ఎస్ 70 సీట్ల ఆధిక్యంలో దూసుకు పోతోంది. ఈ ఎన్నికల్లో ఖశ్చితంగా గెలుస్తామనుకున్న కూటమి నేతల ఆశలు ఆవిరయ్యాయి. కాంగ్రెస్ వస్తే సీఎం అవుదామని భావిస్తున్న ముఖ్య నాయకులందూరూ కూడా వెనుకంజలో ఉన్నారు. గజ్వేల్, కొడంగల్ లలో ప్రచారం నువ్వా నేనా అన్నట్లుగా సాగింది.
ప్రస్తుత ఫలితాల ప్రకారం కొండగల్లో రేవంత్రెడ్డి వెనుకంజలో ఉన్నారు. తొలిరౌండ్లో డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కారును వెంటాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కూడా హైస్పీడ్లో దూసుకుపోతుంది.మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో మహాకూటమి మద్దతుతో పోటీపడిన మల్ రెడ్డి రంగారెడ్డి ముందంజలో ఉన్నారు.