Saturday, April 27, 2024
- Advertisement -

సీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు..!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ కుట్రలు మొదలుపెట్టాడని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు చంద్రబాబు నాయుడు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.

గతంలో మహానేత వైఎస్సార్ సీఎంగా ఉండగా జలయజ్ఞం ప్రాజెక్టులకు ఆటంకాలు కల్పించినట్టుగానే రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు బ్రేకులు వేసే కుట్రలు మొదలు పెట్టాడు చంద్రబాబు. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో కేసులు వేయించి అనుమతులను అడ్డుకోవాలని చూస్తే ప్రజల ఉసురు తప్పక తగులుతుంది’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చ‌దువు ‘కొన్న’ లోకేష్‌ కితకితలు

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

దుకుడు తగ్గించిన సోము వీర్రాజు కారణం ఎంటో..?

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -