- Advertisement -
వైసీపీ ఎమ్మెల్యే రోజా మరో సారి బాబు, లోకేష్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరి నియోజకవర్గంలో ఎవరు పోటీచేసినా తనకు చంద్రబాబు, లోకేష్ లే ప్రత్యర్థులని పేర్కొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ సర్కారు తన నియోజకవర్గానికి నిధులు విడుదల చేయకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. అయినా కూడా నియోజక అభివృద్ధికోసం ఎంతో కృషిచేశానని అన్నారు.