Friday, April 26, 2024
- Advertisement -

మన్మధుడు హీరోయిన్ అన్షు ఇప్పుడు ఎలా ఉందంటే ?

- Advertisement -

కింగ్ నాగార్జున హీరోగా వచ్చిన మన్మధుడు సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఆ మూవీలో నాగార్జునకి జోడీగా సోనాలి బింద్రే, అన్షు అంబానీ నటించారు. అన్షు అంబానీ మన్మధుడు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. అచ్చు తెలుగు అమ్మాయిలా తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెల్చుకుంది అన్షు అంబానీ.

ఈ మూవీలో అన్షు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీ లో నటించిన అన్షు ఆ తర్వాత తెలుగు సినిమాలో కనిపించలేదు. కన్నడ, తమిళ పలు సినిమాల్లో కనిపించిన ఆమె సడన్గా ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుంది. చాలా కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అన్షు ఇప్పుడు ఏం చేస్తుంది ? ఎలా ఉంది ? అనేది మనం ఇప్పుడు చూసేద్దాం. అన్షు ప్రస్తుతం లండన్ లో ఉంటుంది. 2011లో అన్షుకి వివాహం జరిగింది. అన్షు భర్త పేరు సచిన్. ఆయన బిజినేస్ మెన్.

సచిన్ ఫ్యామిలీ లండన్ లో సెటిల్ అవడం తో పెళ్లి తర్వాత అన్షు కూడా లండన్ కి షిఫ్ట్ అయింది. అన్షుకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఒక పాప ఒక బాబు. లండన్ లో కొంతకాలం ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేసి.. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేసింది. ఇన్స్పిరేషన్ కౌంటర్ అనే పేరుతో డిజైనింగ్ స్టూడియోని కూడా ఏర్పాటు చేసుకుంది. అన్షు లండన్ లో ఉంటున్న కానీ బాలీవుడ్ హీరోయిన్స్ చాలామందికి ఆమె ఔట్ ఫీట్ డిజైన్ చేసి పంపిస్తా ఉంటుంది. ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ని మరోవైపు తన ఫ్యాషన్ ను కంటిన్యూ చేస్తూ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -