- Advertisement -
న్యూజిలాండ్లో మసీదులే క్ష్యంగా దుండగులు జరిపిన దాడుల్లో 49 మంది మృతిచెందగా 20 మంది గాయపడ్డారు. ఈ కాల్పులనుంచి బంగ్లా క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న మంగ్లాటీమ్..క్రైస్ట్చర్చ్లోని హాగ్లీ ఓవల్ స్టేడియానికి సమీపంలో ఉన్న మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు బంగ్లాదేశ్ క్రికెటర్లు వెళ్లారు.
అక్కడ ప్రార్థనలు జరుగుఉతన్న సమయంలో.. గన్తో ప్రవేశించిన ఓ అగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడి నుంచి బంగ్లాదేశ్ క్రికెటర్లు సురక్షితంగా బయటపడినట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి.