- Advertisement -
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గృహ హింస కేసునుంచి విముక్తి లభించింది.అతడిపై చేసిన ఆరోపనలు, అవాస్తవాలని ఆకాంక్ష శర్మ అంగీకరించిందని యూవీ కుటుంబ సభ్యలు తెలిపారు.రెండేళ్ల క్రితం సోదరుడు జోరావర్ భార్య ఆకాంక్ష శర్మ.. యువరాజ్తో పాటు అతని కుటుంబంపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
యూవీ సోదరుడు జొరావర్ సింగ్ భార్య ఆకాంక్ష సింగ్ . పెళ్లైన ఆరునెలలకే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో భర్తతో సహా యూవీ, అతడి తల్లి షబ్నమ్ పై 2017 అక్టోబర్ లో గృహ హింస కేసు పెట్టింది.ఇటీవల జోరావర్-ఆకాంక్ష సింగ్లు కోర్టు ద్వారా విడాకులు మంజూరు చేసింది.చట్టం నుంచి తప్పించుకోలేని సందర్భంలో యువరాజ్పై పెట్టిన కేసును ఆకాంక్ష ఉపసంహరించుకున్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.