Friday, April 26, 2024
- Advertisement -

జట్టులోఖి ధోనిని ఎలా తీసుకుంటారు ? : గౌతమ్ గంభీర్

- Advertisement -

భారత జట్టుకు కొంత కాలంగా దూరంగా ఉంటున్న ధోనిని ఏ ప్రాతిపదికన టీంలోకి తీసుకుంటారు ? అని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశ్నించారు. 2019, జులైలో ఆఖరిగా టీమిండియా తరఫున వన్డే ప్రపంచకప్‌లో ఆడిన ధోనీ తర్వాత జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో ఆడిన తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

దీంతో వరల్డ్ కప్ టీంలోకి అతడ్ని ఏ లెక్కన ఎంపిక చేస్తారు ? అని గంభీర్ అన్నారు. ధోనీ అనుభవం ఉన్న వ్యక్తి కావడం వల్ల వరల్డ్ కప్ లో ఉంటే బాగుంటుందని భావిస్తున్న టీమిండియా మేనేజ్ మెంట్.. ఐపీఎల్ 2020 సీజన్‌లో అతను ఫామ్ లోకి వస్తే జట్టులోకి ఎంపిక చేసేందుకు రెడీ అని ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు టీమ్ చీఫ్ కోచ్ రవిశాస్త్రి కూడా విస్పష్టమైన ప్రకటన చేశాడు. దీంతో.. ఐపీఎల్ కోసం ధోనీ దాదాపు రెండు వారాలు సీరియస్‌గా చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా చేశాడు.

కానీ.. కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ ఏప్రిల్ 15కి వాయిదాపడిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికీ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ ఏడాది ఐపీఎల్ ఉండకపోవచ్చన్న అనుమానం నెలకొంది. అయితే ధోనీ భవితవ్యం గురించి తాజాగా గంభీర్ మాట్లాడుతూ.. “ఈ ఏడాది ఐపీఎల్ జరగకపోతే..? టీమిండియాలోకి మహేంద్రసింగ్ ధోనీ రీఎంట్రీ చాలా కష్టమవుతుంది.

అయినా.. అతడ్ని ఏ ప్రాతిపదికన టీమ్‌లోకి ఎంపిక చేస్తారు..? అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. అప్పటికి ధోనీ మ్యాచ్‌లాడి ఏడాదిపైనే అయిపోతుంది. ఇక.. మైదానంలో ఎవరైతే అత్యుత్తమంగా ఆడి.. జట్టుని గెలిపిస్తారో..? వారే జట్టులో ఉండాలి. ఆఖరిగా ధోనీ రిటైర్మెంట్.. అది అతని వ్యక్తిగత నిర్ణయం’’ అని గంభీర్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -