Saturday, April 27, 2024
- Advertisement -

రోహిత్ కు మద్దతుగా నిలిచిన కెప్టెన్ కోహ్లీ….

- Advertisement -

టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ విశాఖలో రేపటినుంచి జరిగే మొదటి టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగనునున్నట్లు తెలుస్తోంది. విండీస్ టూర్ లో రాహుల్ విఫలం చెందడంతో ఆ స్థానంలో టెస్టుజట్టులో చోటు సంపాదించాడు రోహిత్. ఇటీవల దక్షిణాఫ్రికా జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌ కావడంతో అతను ఓపెనర్‌గా సరైన వ్యక్తి కాదనే వాదన మరోసారి తెరపైకి వచ్చింది. అయితే కోహ్లీ మాత్రం రోహిత్ కు మద్దతుగా నిలిచాడు.

రోహిత్‌ విషయంలో మాకేమీ తొందరలేదు. అతను టెస్టు ఓపెనర్‌గా సక్సెస్‌ అవుతాడా.. లేదా అప్పుడే తెలియదు. కచ్చితంగా రోహిత్‌ టెస్టు ఓపెనర్‌గా కూడా రాణిస్తాడంటూ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు.సరైన సమయంలో రోహిత్‌ గాడిలో పడతాడు…కొంత సమయం ఇవ్వాలని కెప్టెన్ పేర్కొన్నారు.

రోహిత్‌ను ఓపెనర్‌గా దింపే క‍్రమంలోనే రోహిత్‌ను టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఎంపిక చేసింది. అదే సమయంలో మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఉద్వాసన పలికారు. రేపట్నుంచి సఫారీలతో విశాఖలో జరుగనున్న తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -