- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్లో భాగంగా ఢిల్లీ డేర్డెవిల్స్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ప్లీఆఫ్రేస్నుంచి ఢిల్లీ డేర్ డేవిల్స్ వైదొలిగింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్లాడిన చెన్నై జట్టు ఏకంగా 8 మ్యాచ్ల్లో గెలుపొంది ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తుని ఖాయం చేసకుంది.
చివరిగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలోనూ ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు చెన్నై జట్టు ఈ మ్యాచ్లో గెలుపొందడం ద్వారా.. మళ్లీ పట్టికలో అగ్రస్థానాన్ని చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో నెం.1 స్థానంలో ఉండగా.. చెన్నై 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.