ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబయ్ ఆటగాడు పోలార్డ్ అంపైర్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో.. పొలార్డ్ బ్యాటింగ్ చేస్తుండగా.. అంపైర్ వరుసగా రెండు వైడ్ బంతుల్ని లీగల్ డెలివరీలుగా ప్రకటించాడు. దీంతో అసహనానికి గురయిన పోలార్డ్ బ్యాట్ను పైకి ఎగరేసి తన నిరసనను తెలిపారు. దీంతో జరిమానా విధించారు.
అంతటితో ఊరుకోకుండా క్రీజులోనే బ్యాట్ని గాల్లోకి ఎగరేసి.. ఆ తర్వాత బంతిని.. వైడ్లైన్ వెలుపలికి వెళ్లి మరీ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఆఖరి క్షణంలో మళ్లీ అతను వికెట్లకి దూరంగా వెళ్లిపోవడంతో.. అంపైర్ బౌలింగ్ని నిలిపివేయించాడు. దీంతో.. అంపైర్పై నిరసన వ్యక్తం చేయడంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమాణా విధించారు. అయితే, పోలార్డ్ చేసిన తప్పిదమేమిటో ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ వెల్లడించలేదు.