ఐపీఎల్ 12వసీజన్లో కోల్కతా నైట్రైడర్స్ రెచ్చిపోతోంది. సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 28 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను ఓడించింది. టాస్ గెలిచి పంజాబ్ మొదట ముందుగా కోల్కతాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప ( 67 ), నితీశ్ రాణా (63) రాణించడంతో 218 పరుగులు భారీ లక్ష్యాన్ని పంజాబ్ ముందు ఉంచగలిగింది.
వెస్టిండిస్ స్టార్ అల్రౌండర్ ఆండ్రీ రసెల్ చివర్లో మెరుపులు మెరిపించాడు. రసెల్ 17 బంతుల్లోనే 48 పరుగులు చేశాడ. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులే చేయగలిగింది. డేవిడ్ మిల్లర్ (59 ) మయాంక్ అగర్వాల్ ( 58) అర్ధసెంచరీలు చేసినా జట్టును గెలిపించేందుకు అవి సరిపోలేదు. ఈ విజయంతో కోల్కతా నైట్రైడర్స్ తన ఖాతాలో మరో 2 పాయింట్లను వేసుకుంది.
- Advertisement -
ఆండ్రీ రసెల్ మెరుపులు…నైట్రైడర్స్ వరుసగా రెండో విజయం
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -