టీమిండియా ఫేస్ బౌలర్ షమీ మరో సారి వివారంలో ఇరుక్కున్నారు. షమీ తనకు మెసేజ్ చేస్తున్నాడంటూ ఓ మహిళ ఆరోపించడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే అతని భార్య హసీన్ జహాన్ షమీ స్త్రీలోలుడని, చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్కు కూడా పాల్పడ్డారని ఆరోపించని సంగతి తెలిసిందే. అ ప్పట్లో షమీ కెరీర్ కు పుల్స్టాప్ పడ్డట్లే అన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా షమీకి కాంట్రాక్ట్ నిరాకరించిన బీసీసీఐ.. విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చింది.
షమీ ప్రస్తుతం ప్రపంచకప్ నేపథ్యలో ఇంగ్లండులో ఉన్నారు. తాజాగా మరోసారి షమీపై అలాంటి ఆరోపణలే వచ్చాయి. ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్స్టాగ్రామ్ వేదికగా తనకు పదేపదే మెసేజ్లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ‘1.4 మిలియన్ ఫాలోయర్స్ ఉన్న గొప్ప క్రికెటర్ నాకే ఎందుకు మెసేజ్ చేస్తున్నాడో ఎవరైన చెప్పగలరా?’ అని మెసేజ్ స్క్రీన్ షాట్స్ జత చేసి ప్రశ్నించింది. అయితే షమీ సదరు మహిళకు ‘గుడ్ ఆఫ్టర్నూన్’ అని మెసేజ్ చేసినట్లు ఆ స్క్రీన్ షాట్స్లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీకి మద్దతుగా ట్వీట్ చేస్తెంటె ….మరి కొందరు వ్యతిరకంగా కామెంట్లు పెడుతున్నారు.