Saturday, April 27, 2024
- Advertisement -

ధోనీ రీఎంట్రీ కోసం పాక్ కూడా వేచి చూస్తోంది..!

- Advertisement -

భారత క్రికెట్ మాజీ కెఫ్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రీ ఎంట్రీ కోసం భారత అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన ఎంట్రీ కోసం భారత్ ఫ్యాన్సే కాదు పాకిస్థాన్ ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తాజాగా స్పష్టమైంది. ఐపీఎల్ తరహాలో పాక్ గడ్డపై జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ మ్యాచ్‌ని వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లిన అభిమాని జెర్సీ చూసి అందరూ షాక్ అయ్యారు.

పాకిస్థాన్ జాతీయ జట్టు జెర్సీ ధరించిన ఆ అభిమాని.. జెర్సీ వెనుక ధోనీ పేరు, జెర్సీ నెం.7ని ముద్రించుకున్నాడు. దాంతో అతను స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతను పోస్ట్ చేసిన ఫోటోకి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. వాస్తవానికి ఆ పాకిస్థాన్ అభిమాని.. పీఎస్‌ఎల్‌లో ఆడుతున్న ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కి మద్దతు తెలిపేందుకు వచ్చాడు.

కానీ.. ధోనీ పేరు, నెంబరు ఉన్న జెర్సీ ధరించి.. భారత మాజీ కెప్టెన్‌పై అభిమానాన్ని చాటాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్‌తో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈమెరకు చెన్నైకి వెళ్లిన ధోనీ అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఐపీఎల్లో ధోనీ ప్రదర్శన బాగుంటే అతనికి టీమిండియాలో చోటు దక్కే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -