- Advertisement -
వన్డే వరల్డ్కప్లో భాగంగా అఫ్గానిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు ఆదిలోనె పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వరుస సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ రోహిత్శర్మ కేవలం ఒక్క పరుగే చేసి వెనుదిరిగాడు. దాంతో భారత్ 7 పరుగుల వద్ద తొలి వికెట్ను నష్టపోయింది.
టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఇన్నింగ్స్ను రోహిత్, కేఎల్ రాహుల్లు ఆరంభించారు. న్నర్ ముజీబ్ ఉర్ రహ్మాన్తో అఫ్గాన్ మొదటి ఓవర్ను వేయించింది. అయితే ముజీబ్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతికి రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 10 బంతులు ఆడిన రోహిత్ పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.