శుక్రవారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ విజయం సొంతం చేసుకుంది. వెస్టిండీస్ టీమ్ చాలా ఎత్తులు వేసినప్పటికి అన్నిటిని కెఫ్టెన్ విరాట్ కోహ్లీ తిప్పి కొట్టాడు. 50 బంతుల్లో 94 (నాటౌట్) పరుగులు చేసి ఒంటిచేత్తో టీమిండియాని గెలిపించాడు.
తొలిత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేయగా.. ఛేదనలో విరాట్ కోహ్లీ చెలరిగేపోయాడు. 8 బంతులు మిగిలి ఉండగానే జట్టుని గెలిపించాడు. ఇక రెండో టీ20 మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ఆదివారం రాత్రి జరగనుంది. అయితే 16వ ఓవర్ వేసిన విలియమ్స్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ వరసగా సిక్సర్లు కొట్టడంతో విజయం భారత్ వైపు తిరిగింది.
దాంతో విండీస్ కెప్టెన్ పొలార్డ్ అతి తెలివితో కొన్ని ఎత్తులు వేశాడు. అప్పటికే విలియమ్స్ పిచ్ మధ్యలో తన పరుగుకి రెండు సార్లు అడ్డుపడటంతో ఫీల్డ్ అంపైర్కి ఫిర్యాదు చేసిన కోహ్లీ.. అతనిపై గుర్రుగా కనిపించాడు. విలియమ్స్ ఎత్తుగడ వర్కవట్ కాకపోవడంతో స్వయంగా పొలార్డ్ 18వ ఓవర్లో రంగంలోకి దిగాడు.
తొలి బంతికి శ్రేయాస్ అయ్యర్ సింగిల్ తీయగా.. రెండో బంతికి కోహ్లీ స్ట్రైకింగ్కి వెళ్లాడు. దాంతో మునుపటి ఎత్తుగడని మళ్లీ కోహ్లీపైకి పొలార్డ్ ప్రయోగించాడు. కోహ్లీని అసహనానికి గురిచేస్తూ వైడ్ విసిరాడు. ఆ వైడ్ బంతికి ముందు బౌలింగ్ చేస్తూ సడన్గా బంతి విసరడాన్ని నిలిపివేశాడు.
దాంతో పొలార్డ్ వైపు కోహ్లి విసురుగా చూసి.. లెగ్ అంపైర్కి ఫిర్యాదు కూడా చేశాడు. ఆ తర్వాత పొలార్డ్ విసిరిన బంతిని సిక్స్గా మలిచి.. లెక్క సరిపోయిందా ? అనే తరహాలో సైగల్ చేస్తూ కనిపించాడు. ఆ సిక్స్ తో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది.