తెలుగు సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ అవుదామని వచ్చిన ఎంతో మంది హీరోలుగా.. విలన్లుగా సెటిల్ అయ్యారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకరు. కెరీర్ బిగినింగ్ లో ప్రముఖ దర్శకులు బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత అనుకోకుండా అష్టాచమ్మ చిత్రంతో హీరోగా మారారు. ఏ పాత్ర పోషించినా అందులో సహజంగా కనిపిస్తూ తనదైన ముద్ర వేసే హీరోగా నానికి పేరుంది. అందుకే నేచురల్ స్టార్ గా కూడా పేరుతెచ్చుకున్నాడు. అయితే, దర్శకుడు అవ్వాలన్న తన చిరకాల కోరికను ఇప్పుడు నాని మరోలా తీర్చుకుంటున్నాడు.
నాని ప్రస్తుతం ‘టక్ జగదీశ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ఈ చిత్రంలో నాని ఓ డైరెక్టర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తారు.
ఈ చిత్రం కథ కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందట. అయితే షూటింగ్ చేసుకోవాలని అనుకున్నప్పటికీ కరోనా నేపథ్యంలో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. అందుకు బదులుగా కోల్ కతా వీధులు.. ఆ నగర సంస్కృతి వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్స్ వేసి, హైదరాబాదులోనే షూటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. ఏది ఏమైనా నాని తన చిరకాల కోరిక ఈ చిత్రంతో తీర్చుకోబోతున్నాడన్నమాట.
బిగ్ బాస్ లో క్యాస్టింగ్ కౌచ్ పై శివజ్యోతి షాకింగ్ కామెంట్స్..!
హీరోయిన్ గా పనికి రావు అంటూనే పెళ్లి చేసుకున్న రాంకీ..!