బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి 125 సీట్లకు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంది. 100కిపైగా సీట్లలో మహాగట్బంధన్ ముందంజలో ఉంది..మణిపుర్లో ఐదు శాసన సభ స్ధానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో బిజెపి ఓ చోట గెలిచింది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్.. రఘోపుర్ అసెంబ్లీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.జేడీయూ 115, బిజేపి 110 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
అయితే ఇక్కడ చిక్కంతా కరోనాతోనే. వైరస్ నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను సజావుగా నిర్వహించింది ఈసీ. కానీ ఓట్ల లెక్కింపు వేళ.. కేంద్రాల వద్ద ఆయా పార్టీల సభ్యులు గుమిగూడకుండా చూసుకోవడం ఇప్పుడు ఈసీ ముందు ఉన్న అతిపెద్ద సవాలు.
సీన్ రివర్స్.. దుబ్బాక బిజేపి గడ్డ..!
మద్య ప్రదేశ్ లో జోరు కొనసాగిస్తున్న కమలం!
5 రౌండ్లు పూర్తి : బిజేపి జోరు.. కారు బేజారు..!
హసన్పుర్ లో ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ కి గట్టి దెబ్బ..!