సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. తొలి మూడు రౌండ్లు ముగిసేసరికి బిజేపి అభ్యర్థి రఘునందన్రావు 1,259 ఓట్ల ముందంజలో ఉన్నారు.
మూడో రౌండ్లో బిజేపికు 124 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మూడు రౌండ్లు ముగిసేసరికి బిజేపి కి 9,223, తెరాసకు 7,964, కాంగ్రెస్కు 1,931 ఓట్లు వచ్చాయి.
23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో మరికాసేపట్లో స్పష్టం కానుంది. కొవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను కూడా లెక్కిస్తారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.
నేను కాంగ్రెస్ ని వీడబోను.. తేల్చి చెప్పిన విజయశాంతి!
చంద్రబాబు ఆర్భాటాలు దేనికి పనికొస్తాయి..?