హైదరాబాద్: బోయిన్పల్లి కిడ్నాప్ కేసుతో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. మీడియాలో ఈ కేసుకు సంబంధించి పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది అఖిలప్రియ పట్ల సానుభూతి ప్రకటిస్తుండగా.. ఆమె అంటే గిట్టనివాళ్లు మాత్రం పాపం పండితే ఇలాగే జరుగుతుంది అంటూ దెప్పిపొడుస్తున్నారు. ఇదిలా ఉంటే భూమా కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రం అఖిలప్రియ భర్త భార్గవ్రామ్పై మండిపడుతున్నారు. కట్టుకున్న భార్యను పోలీసులు అరెస్టు చేసినా.. పరారీలో ఉన్న అతడి తీరును బాహాటంగానే విమర్శిస్తున్నారు.
తమ ఆడబిడ్డను అనవసరంగా కేసులో ఇరికించాడని, ఈ ఘటనతో తమ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా భార్గవ్రామ్ పద్ధతి మార్చుకోవాలని, వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయి అసలు విషయం బయటపెట్టాలని సూచిస్తున్నారు. అసలు తమ కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే మగవాళ్లే ముందుకు వస్తారని, ఇలా ఆడవాళ్లను జైలు పాలు చేయరంటూ అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేగాక.. భూమా మౌనిక మీడియాతో మాట్లాడుతూ.. ‘మా నాన్న ఉన్నప్పటి నుంచే ఈ భూమి సమస్య ఉంది. వాళ్లు చనిపోయిన తరువాత మమ్మల్ని ఎందుకు ఇబ్బందులపాలు చేస్తున్నారు. మా అక్క విషయంలో పోలీసుల స్టేట్మెంట్ సరిగ్గా లేదు. ఒక మాజీ మంత్రిని ఇలా ట్రీట్ చేస్తారా. ఆమెకు అసలే ఆరోగ్యం బాగాలేదు అన్న మాటలకు బదులుగా ముందు మన ఇంట్లో వాళ్లు ఎలా ఉన్నారో చూసుకోవాలి అంటూ భార్గవ్రామ్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. భార్య ఇబ్బంది పడుతున్నా దొంగతనంగా తలదాచుకుంటున్న దమ్మూ, ధైర్యం లేనివాడు అంటూ విమర్శిస్తున్నారు.
అఖిలప్రియ అరెస్టు ఏపీలో అయితే… వేరేలా ఉండేది…
కేసీఆర్కు హెల్త్ చెకప్, నెక్ట్స్ సీఎం ఆయనేనా?