ఏబీఎన్ డిబేట్లో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డిపై అమరావతి జేఏసీ నేత , దళిత నాయకుడు శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటన ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ప్రముఖ తెలుగు ఛానెల్లో చర్చా కార్యక్రమం సందర్భంగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చెంప ఛెళ్ళుమంది.. అది కూడా చెప్పుతో. అమరావతిలో అసంపూర్తి భవనాలను నిర్మించేందుకు జగన్ సర్కార్ ముందుకొచ్చింది.
ఈ నేపథ్యంలో 50 శాతం, అంతకు మించి పూర్తై ఆగిపోయిన నిర్మాణాలను రూ.3 వేల కోట్లతో పూర్తి చేయాలని జగన్ సర్కార్ ఈ రోజు నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై డిబెట్ లో కాస్త సీరియస్ గానే చర్చ సాగుతుంది. గ్రాఫిక్స్ పూర్తి చేద్దాం శీర్షికతో చర్చా కార్యక్రమం చేపట్టారు. రాజధాని అమరావతిలో గత టీడీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు నిర్మాణాలేవీ లేవని, అంతా గ్రాఫిక్స్లో చూపారని అధికార వైసీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
దీన్ని వ్యంగ్య ధోరణిలో ఏబీఎన్ డిబేట్ చేపట్టడం గమనార్హం. అమరావతి గురించి చర్చ జరుగుతున్న సమయంలో, ‘టీడీపీ ఆఫీసులో పని చేసుకో.. టీడీపీ జెండా పట్టుకో..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. దాంతో అమరావతి జేఏసీ నేత శ్రీనివాసరావు సహనం కోల్పోయారు.. ఈ క్రమంలో పలుమార్లు బీజేపీ నేత విష్ణుని హెచ్చరించారు కూడా. అయినా విష్ణు తగ్గలేదు.
ఇక కోపం తట్టు కోలేక అందరూ చూస్తుండగానే లైవ్ లో చె్పుతో విష్ణు చెంపపై కొట్టాడు శ్రీనివాస రావు. ఇంతలా హీటెక్కుతోంటే టాపిక్ డైవర్ట్ చేయాల్సిన సదరు విశ్లేషకుడైన సీనియర్ జర్నలిస్ట్.. ఏదో మొహమాటానికి వారిస్తున్నట్లు ‘మమ’ అన్పించేశారంతే. ఈ చర్చను చూస్తున్న ప్రేక్షకులు షాక్కు గురయ్యారు.