మాస్ మహారాజా రవితేజ సినిమాలంటేనే ఎనర్జీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన ఇప్పటికే వరకు తీసిని సిమాలు అదే తరహాలో మాస్ క్లాస్ ప్రేక్షకులను ఉర్రుతలుగిస్తుంటాయి. అయితే, గత కొంత కాలంగా మాస్ రాజాకు టైం బాగులేదు. ఆయన తీసిని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడుతున్నాయి. ఓ మంచి హిట్ కోసం కొంత కాలంగా ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ.
ఈ నేపథ్యంలోనే ఇటీవల మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురించింది. గోపీచంద్ మలినేని- రవితేజ కాంభినేషన్లో వచ్చిన ఈ హ్యాట్రిక్ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి.. రవితేజకు పూర్వవైభవం సంపాదించిపెట్టింది. వెండితెరపై బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ పైన కూడా దుమ్ము రేపుతోంది.
ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో రవితేజ క్రాక్ సినిమా ఈ నెల 5 (ఫిబ్రవరి 5) నుంచి స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం నాటికి 250 మిలియన్ నిమిషాల వ్యూయర్ షిప్ సాధించింది, దీంతొ ‘ఆహా’ ప్లాట్ ఫామ్ గత రికార్డులను తిరగరాసింది మాస్ మహారాజా క్రాక్ మూవీ. ఈ విషయాన్ని తాజాగా ఆహా యాజమాన్యం అధికారికంగా తెలిపింది. ఇదివరకు ఆహాలో అత్యధిక వ్యూయర్ షిప్ రికార్డు కలర్ ఫొటో సినిమా పేరిట ఉంది.
బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..
‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అనసూయ
పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్