2019 ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఇప్పటికేపవన్ ప్రజల్లోకి వెళ్ళి.. సభలు పెట్టి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఎమ్మెల్యే సీటుతో పాటు ఏకంగా సీఎం సీటే దక్కుతుందని రాజకీయ పండితులు అంటున్నారు. ఏపీలో మంచి నాయకత్వం ఉన్న ప్రజా సమస్యలను సర్కారు తీర్చలేకపోతోందనే విమర్శలు వస్తున్నాయి.
విభజన తర్వాత ఏపీ కష్టాల్లో ఉండిపోయింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ సంగతిని టీడీపీ యంత్రాంగం పక్కనబెట్టేసింది. దాంతో ప్రజల్లో టీడీపీ ప్రభుత్వం పై నమ్మకం పోయింది. బీజేపీ మాత్రం విభజన సమయంలో ఏపీకి హోదా ఇస్తామని పలికిన ప్రగల్భాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో కొత్త నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారు. పవన్ వైపే పవనాలు వీచే అవకాశం వున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో పవన్కు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలుస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే 2019 ఎన్నికల కోసం పూర్తిస్థాయి కసరత్తులు చేస్తున్నారు.. పవన్ కల్యాణ్. రీసెంట్ గా 2019లో పవన్కే పవరొస్తుందని నాగబాబు అన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ప్రచారం చేస్తే బాగుంటుందని వ్యక్తిగతంగా ఆశించారు.
ఓ ఇంటర్వ్యూలో నాగబాబు మాట్లాడుతూ.. జనసేన తరపున తమ్ముడి కోసం అన్నయ్య ప్రచారం చేస్తే తప్పకుండా విజయం ఖాయమని.. అప్పుడే ఏపీలో జనసేనకు పవరొస్తుందని.. నీతి నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లో వచ్చినట్లవుతుందని తెలిపారు. మరి మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి వుంది. ఇప్పటికే ప్రజారాజ్యం స్థాపించి.. ఆ తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేసి.. ప్రస్తుతం సినిమాలో కొనసాగుతున్నారు. త్వరలో కాంగ్రెస్ కి కూడా స్వస్తి చెప్పి జనసేనాకు మద్దతు పలికి.. పవన్ను గెలిపిస్తారని.. తద్వారా రాజకీయాలకు బై చెప్పి.. సినిమాలు చేసుకుంటూ పోవాలని చిరంజీవి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చిరు ప్రచారం ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
{youtube}HPDYK4gyzhE{/youtube}
Related