జీతూ జోసెఫ్ మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం మూవీ అన్ని భాషల్లోనూ విడుదలై సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మిడిల్ క్లాస్ మెలోడ్రామాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగు రీమేక్ దృశ్యంలో మీనా - వెంకటేశ్ జంటగా నటించగా.. తమిళ రీమేక్ పాపనాశనంలో కమల్ హాసన్ – గౌతమీ జోడీగా చేశారు. ఇటీవల మలయాళంలో దృశ్యం సీక్వెల్ గా కూడా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దీంతో అన్ని భాషల్లో దృశ్యం2 సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే తెలుగులో దృశ్యం 2 షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇదిలా ఉంటే తమిళంలో ఇండియన్ -2లో నటిస్తున్న కమల్ హాసన్.. వివిధ కారణాల వల్ల ఆ సినిమాను పక్కనపెట్టాడు. ప్రస్తుతం దృశ్యం 2లో నటించాలని ఆయన భావిస్తున్నారు. జీతూ జోసెస్ ను డైరెక్టర్గా పెట్టుకోవాలని భావించారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్న విషయంలో సందిగ్ధత నెలకొన్నది. ఎందుకంటే దృశ్యం- 1 తమిళంలో గౌతమి చేసింది. అప్పుడు కమల్ – గౌతమి రిలేషనల్లో ఉన్నారు. దీంతో ఈ మూవీ చేశారు. ప్రస్తుతం వివిధ కారణాలతో వాళ్లు విడిపోయారు. కాబట్టి గౌతమితో చేసే చాన్స్ లేదు. దీంతో గౌతమి ప్లేస్లో మీనాను ఎంపికచేసినట్టు సమాచారం. మీనా – కమల్ కాంబినేషన్లో గతంలో పలు సినిమాలు వచ్చాయి. పాతికేళ్ల విరామం తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలసి నటించబోతున్నారు.
Also Read
బీ టౌన్ పై తెలుగు అగ్ర హీరోల కన్ను..!