సర్కారువారి పాట సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్తోపాటు సినీ అభిమానులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే లాక్డౌన్ ఎఫెక్ట్తో షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ ఎత్తేశారు. థియేటర్లు కూడా తొందర్లోనే తెరుచుకొనే అవకాశం ఉంది. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో షూటింగ్లు, థియేటర్లలో సినిమాలు విడుదల చేసుకొనేందుకు తెలంగాణలో ఫుల్ పర్మీషన్ వచ్చినట్టే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి.
కొన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్లను ఇప్పటికే ప్రారంభించారు. షూటింగ్ చివరి దశ కు చేరుకున్న సినిమాలకు ముందుగా అనుమతులు ఇచ్చారు. ఈ క్రమంలో సర్కారువారి పాట .. షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారట. ఇప్పటికే ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. రెండో షెడ్యూల్ లో ఉండగా షూటింగ్ నిలిచిపోయింది. తిరిగి త్వరలోనే ఈ సినిమా ప్రారంభించబోతున్నారు.
Also Read: షూటింగ్ లు ప్రారంభం .. ఆ సినిమాలకే ప్రాధాన్యం..!
సర్కారువారి పాట సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరశురామ్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. బ్యాంకు దోపిడీలు, ఆర్థికవ్యవహారాలకు సంబంధించిన ఓ డిఫరెంట్ సబ్జెక్ట్తో ఓ మూవీ రాబోతున్నదట.
Also Read: ఆర్ఆర్ఆర్ షూటింగ్ డేట్ ఫిక్స్.. మరి రిలీజ్ ఎప్పుడో?