సాధారణంగా చాలా మంది వివిధ రకాల పప్పు దినుసులతో వడలు తయారుచేస్తుంటారు. కానీ కొంచెం భిన్నంగా రుచికరంగా, కరకరలాడే గారెలు తినాలనిపించే వారు మొక్క జొన్నలతో వడలు తయారు చేసుకుని ఆ రుచిని ఆస్వాదించవచ్చు. మరి మొక్కజొన్న వడలను ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం…
కావలసిన పదార్థాలు:
లేత మొక్కజొన్న గింజలు 2 కప్పులు,శనగపిండి 2 టేబుల్ స్పూన్లు,బ్రెడ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి 2 స్పూన్లు,అల్లం చిన్న ముక్కలు,
జీలకర్ర ఒక టీ స్పూన్,ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు,అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు,
కొత్తిమీర తురుము,కరివేపాకు కొద్దిగా,నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.
తయారీ విధానం:
*ముందుగా మొక్కజొన్న గింజలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ గిన్నెలోకి తగినంత ఉప్పు జీలకర్ర అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి.
Also read:ఆ స్టార్ దర్శకుడికి నో చెప్పిన త్రిష… కారణం అదే?
- ఇప్పుడు ఈ మిశ్రమంలోకి శెనగపిండి, బ్రెడ్ పౌడర్,మొక్కజొన్న పిండి వేసి బాగా కలుపుకోవాలి.
- ఇందులోకి ముందుగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి తయారు చేసుకోవాలి.
*ఈ క్రమంలోనే స్టవ్ మీద కడాయిలో నూనె పెట్టి బాగా మరిగిన తర్వాత ఈ మొక్కజొన్న పిండి మిశ్రమంతో వడలు మాదిరిగా వేసి వేయించుకోవాలి.
- వడలు ఎరుపు రంగులోకి రాగానే తీసుకుంటే ఎంతో రుచికరమైన, కరకరలాడే మొక్కజొన్న వడలు తయారైనట్లే.
Also read:ఆ కారణంగానే సినిమాలకు దూరమయ్యా… నటి సదా!
*ఈ విధంగా మొక్కజొన్న వడలు తయారు చేసుకొని తినడం వల్ల కేవలం రుచికి మాత్రమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.