ఇప్పటికే కరోనా వైరస్తో ప్రపంచదేశాలన్నీ తలకిందులవుతున్న వేళ.. మనదేశంలోని కేరళ రాష్ట్రంలో వైద్య నిపుణులు మరో వైరస్ను గుర్తించారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం జికా వైరస్ కలకలం రేపుతున్నది. తిరువనంతపురం జిల్లాలో దాదాపు 13 జికా కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు. పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్కు 19 శాంపిళ్లను పంపించగా.. 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అంతకుముందు 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్ తొలిసారి వెలుగు చూసింది. ఈ నెల 7న ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా. బిడ్డలో వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఎలా సోకుతుంది?
జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి మనుషులకు సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్కు ఇప్పటివరకు చికిత్స లేదు. 1947లో ఉగాండా అడవుల్లోని కోతుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి.
లక్షణాలు ఏమిటి?
జికా వైరస్ ప్రాణాంతకం ఏమీ కాదని డాక్టర్లు అంటున్నారు. అయితే దోమల ద్వారా ఈ వ్యాధి తొందరగా వ్యాపించే అవకాశం ఉందని.. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జ్వరం, శరీరంపై దద్దుర్లు ఏర్పడే అవకాశం ఉంది. తలనొప్పి, ఒళ్లునొప్పులు కనిపించే అవకాశం ఉంది. ఇక చిన్నపిల్లలను జాగ్రత్తగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యాధి పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read