చైనాలోని వూహాన్ ల్యాబ్లో పుట్టిందని అందరూ భావిస్తున్న కరోనా వైరస్ నేడు రూపాంతరం చెందింది. జన్యుమార్పిడి చేసుకొని మరింత శక్తివంతంగా తయారై విజృంభిస్తున్నది. అయితే ఇప్పటికే కరోనా వైరస్కు అనేక దేశాలు వ్యాక్సిన్లు రూపొందించాయి. అయితే రూపాంతరం చెందిన వైరస్లపై ఈ వ్యాక్సిన్లు పనిచేస్తాయా? లేదా? అన్న విషయంపై సర్వత్రా ఆందోళన నెలకొన్నది.
తాము తయారుచేసిన వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లపై పనిచేస్తున్నాయని ఇప్పటికే పలు కంపెనీలు చెబుతున్నాయి. మరోవైపు ప్రస్తుతం కరోనా థర్డ్వేవ్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలందరికీ వ్యాక్సినేషన్ వేయించడమే మన ముందున్న మార్గమని డబ్ల్యూహెచ్వో సైతం హెచ్చరిస్తున్నది. మరోవైపు కొందరు నిపుణులు మాత్రం థర్డ్వేవ్ పై భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ఫైజర్ వ్యాక్సిన్పై ఓ ఆసక్తికరమైన విషయం వెలుగుచూసింది.
Also Read: ‘సెకండ్వేవ్’ ముప్పు ఇంకా ఉంది.. కేంద్రం వార్నింగ్
ఈ వ్యాక్సిన్ అన్ని కొత్త తరహా వేరియంట్లపై పనిచేస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఫైజర్తో రోగనిరోధకశక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మేరకు టుక్రూ, హెల్సింకి విశ్వవిద్యాలయాల పరిశోధనలో వెల్లడైంది. శాస్త్రవేత్తలు పైజర్ వ్యాక్సిన్ వేసుకున్న మొత్తం 180 మంది ఆరోగ్య కార్యకర్తలపై పరిశోధనలు చేశారు. వారిలో రోగనిరోధక శక్తి బలంగా వచ్చినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మేరకు నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో వివరాలు ప్రచురితమయ్యాయి.
చైనాలోని వూహాన్లో పుట్టిన వైరస్, బ్రిటన్లోని అల్ఫా రకం, దక్షిణాఫ్రికాలో వ్యాప్తి చెందుతున్న బీటా రకం వైరస్పై ఫైజర్ వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్త ఇల్కా జుల్కునెన్ పేర్కొన్నారు.అయితే భారత్లో స్ప్రెడ్ అయినట్లు భావిస్తున్న డెల్టా వేరియంట్పై ఈ వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తుందా? లేదా? అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
Also Read: ఇలా చేస్తే థర్డ్ వేవ్ రాకపోవచ్చు.. !