కొన్ని యూట్యూబ్ చానల్స్ ఎంతగా దిగజారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద కథనాలు ప్రసారం చేస్తూ.. వారి ప్రతిష్ఠను దిగజార్చేలా థంబ్నెయిల్స్ పెడుతుంటాయి. కేవలం వ్యూస్ కోసం పెట్టుకొనే కొన్ని యూట్యూబ్ చానల్స్ ఎటువంటి జర్నలిజం విలువలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం ఓ యూట్యూబ్ చానల్ చిన్న వయసులో చనిపోయిన సౌత్ ఇండియన్ స్టార్ వీళ్లే అంటూ ఓ కథనం ప్రసారం చేసింది.
ఇందులో ఆర్తీ అగర్వాల్, సౌందర్య వంటి హీరోయిన్స్ చనిపోయారంటూ చెప్పారు. అంతేకాక హీరో సిద్ధార్థ్ను కూడా చనిపోయిన వాళ్ల లిస్ట్లో కలిపేశారు. సిద్ధార్థ్ తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. బొమ్మరిల్లు వంటి సక్సెస్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆట, చుక్కల్లో చంద్రుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తదితర సినిమాల్లో నటించాడు. అయితే ఇక్కడ సక్సెస్ రేట్ పడిపోవడంతో ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేసుకుంటున్నాడు. ఇక ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో హీరోగా సిద్ధార్థ్ ఎంపికయ్యాడు. ఇందులో మరో హీరోగా శర్వానంద్ నటిస్తున్నాడు.
Also Read:బజరంగీ బాయ్జాన్ 2 వచ్చేస్తోందా?
ఇదిలా ఉంటే సిద్ధార్థ్ చనిపోయాడంటూ యూట్యూబ్లో ప్రస్తుతం ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో థంబ్నెయిల్లను స్క్రీన్షాట్ తీసి ఓ ఇన్స్టాపేజ్లో పెట్టారు. ఈ పిక్ను ఓ అభిమాని సిద్ధార్థ్ కు పంపించాడు. దీనిపై సిద్ధార్థ్ స్పందిస్తూ.. ‘నిజానికి ఇది చాలా పాత వీడియో. గతంలోనే ఈ వీడియోకు నేను రిపోర్ట్ కొట్టాను. కానీ సదరు యూట్యూబ్ చానల్ వాళ్లు నాకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు’ అంటూ రిప్లూ ఇచ్చాడు సిద్దూ. తాజాగా యూట్యూబ్ చానల్స్పై ప్రముఖ నటుడు నారాయణమూర్తి సైతం ఫైర్ అయ్యారు. తన ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ కొన్ని చానల్స్ ప్రసారం చేయడం సరికాదని ఆయన పేర్కొన్నాడు.
Also Read: ట్విట్టర్లో సౌత్ లోనే నంబర్ 1 ప్లేస్ కి స్టార్ హీరో..!