2015లో విడుదలైన బజరంగీ బాయిజాన్ ఎంతటి సంచలన విజయాన్ని నమోదుచేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఇండియా, పాకిస్థాన్ మధ్య ఓ సున్నితమైన కథాంశంతో తెరకెక్కింది. ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ ఈ మూవీకి కథ అందించాడు. అయితే తాజాగా ఈ మూవీకి సీక్వెల్ రూపొందబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు పార్ట్ 1కు కథను అందించిన విజయేంద్రప్రసాద్.. సీక్వెల్కు కూడా కథను సమకూర్చాడట. ఇప్పటికే ఈ సినిమా కోసం కథను తయారుచేసి సల్మాన్ ఖాన్కు వినిపించాడట. ఆయనకు ఈ కథ ఎంతగానో నచ్చిందని టాక్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read: ‘అలవైకుంఠపురములో ’ హిందీ రీమేక్లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్..!
ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ ఆర్ఆర్ఆర్ కోసం పనిచేస్తున్నాడు. మరోవైపు పలు బాలీవుడ్, కోలివుడ్ చిత్రాలకు ఆయన కథలను అందిస్తున్నారు. బాహుబలి పాన్ ఇండియా స్థాయిలో హిట్ కావడంతో విజయేంద్ర ప్రసాద్ పాన్ ఇండియా రైటర్గా మారిపోయాడు. ఆయన కథల కోసం దేశవ్యాప్తంగా ప్రముఖ దర్శకులు, నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బజరంగీ బాయిజాన్ కూడా మరో విభిన్న కథాంశంతో తెరకెక్కబోతున్నట్టు టాక్.
Also Read: మరోసారి ఎన్టీఆర్ తో పూజా హెగ్డే రొమాన్స్ ..!