పెళ్లిచూపులు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండా. అర్జున్రెడ్డి, గీత గోవిందం చిత్రాలు విజయం సాధించడంతో యూత్తో క్రేజ్ సంపాదించాడు. గీత గోవిందం చిత్రంలో హీరో విజయ్, రష్మిక మందన్నా కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. అయితే అప్పటి నుంచే వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్థింగ్ ఉందంటూ మీడియాల్లో కథనాలు వచ్చాయి. ఇద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ కలిసి ఉన్న ఫొటోల్ని, వీడియోలను వైరల్ అయ్యాయి.
తాజాగా కొన్ని బాలీవుడ్ వెబ్సైట్లు.. వాటి ఆధారంగా కొన్ని లోకల్ వెబ్సైట్లు ఓ అడుగు ముందుకు వేసి కథనాలు ఇచ్చాయి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని వార్తలు రాసేశారు. వీటిపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రతీసారి వార్తల్లో ఇదే చెత్తను చూడాల్సి వస్తోందని ట్విటర్లో కాస్త బూతుపురాణంతోనే చిరాకు వ్యక్తం చేశాడు. తద్వారా అది ఒక ఫేక్ వార్త అని చెబుతూనే.. మీడియాకు చురకలు అంటించాడు.
వాస్తవానికి ఈ ఏడాది చివర్లో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందంటూ తెగ వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా ఇటీవల రష్మిక ప్రేమ, పెళ్లి గురించి కూడా మాట్లాడింది. ప్రస్తుతం ‘లైగర్’తో బిజీగా ఉన్న విజయ్.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ‘జనగణమన’, సుకుమార్తో ఓ సినిమా, శివ నిర్వాణతో ఓ చిత్రం చేయనున్నారు. ‘పుష్ప’తో బంపర్ హిట్ అందుకున్న రష్మిక కూడా ‘పుష్ప 2’ షూటింగ్కు సిద్ధమవుతుంది. ఆమె హీరోయిన్గా చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. మార్చి 4న థియేటర్లలోకి రానుంది.
హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు హిందీ సినిమాలు చేస్తున్న రష్మిక.. ఇటీవల ముంబయిలో అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసింది. న్యూయర్ పార్టీ అక్కడే విజయ్ దేవరకొండతో కలిసి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ చాలాసార్లు బయట కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరూ పెళ్లి త్వరలో అంటూ నెటిజన్లు తెగ మాట్లాడేసుకుంటున్నారు. అయితే ఈ విషయమై వీరిలో ఎవరో ఒకరు మాట్లాడితేనే క్లారిటీ వస్తుంది.
రీల్ జంటలు రియల్ లైఫ్ లో ఒక్కటైన హీరో, హీరోయిన్లు..!