దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో ఘోర ఓటమి నుండి బయటపడలేక పోతోంది టీమిండియా. ఈ నేపథ్యంలో రేపటి నుండి జరిగే రెండో టెస్టును గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేస్ లో నిలవాలంటే ఈ మ్యాచ్తో పాటు సిరీస్ గెలవాల్సి ఉంటుంది. అందుకే ఈ కీలక మ్యాచ్లో పలు మార్పులతో బరిలోకి దిగనుంది టీమిండియా.
అశ్విన్ స్థానంలో జడేజాను తుది జట్టులోకి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అలాగే అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ నెట్ ప్రాక్టీస్ లో గాయపడటంతో ఈ మ్యాచ్కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఠాకూర్ స్థానంలో ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు.
రెండో టెస్ట్ మ్యాచ్ జనవరి 3న కేప్ టౌన్స్ లోని న్యూలాండ్స్ స్టేడియంలో జరగనుండగా రెండో టెస్ట్ లో గెలిచి 2024ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది.రోహిత్ సేన చేసే ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి.