- Advertisement -
ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైను చిత్తు చేసింది సన్ రైజర్స్. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ అదరగొట్టింది. చెన్నై విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది. ఈ మ్యాచ్ను సినీ హీరో వెంకటేష్తో కలిసి వీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి.
మార్క్రమ్ 36 బంతుల్లో 50 పరుగులు చేయగా అభిషేక్శర్మ 12 బంతుల్లో 4 సిక్స్లు,3 ఫోర్లతో 37 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణత ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 165 పరుగులు చేసింది. శివమ్దూబే 24 బంతుల్లో 45, , రహానే(35) పరుగులు చేశారు. హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించగా అభిషేక్శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.