ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ.. అతడి ఫ్రెండ్ రాజారవిచంద్ర కారు ప్రమాదంకు సంబంధించి విచారణ కొనసాగుతునే ఉంది. నిషిత్ నడిపిన కారుకు సంబంధించిన వివరాలు కావలని పోలీసులు అడగగా.. బెంజ్ కంపెనీ నుంచి షాక్ చేస్తే సమాదానం వచ్చింది.
{loadmodule mod_custom,GA1}
దీనిపై జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రహస్యంగా ఉంచాల్సిన దర్యాఫ్తు వివరాలను ఇవ్వడం ఎలా కుదురుతుందని వారు అంటున్నారని తెలుస్తోంది. కారుకు సంబంధించిన వివరాలు కావాలంటే.. కేసు దర్యాప్తు వివరాలు.. పోస్టుమార్టం నివేదిక పంపాలని.. బెంజ్ సంస్థ కోరింది. ఈ విషయంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 10వ తేదీ ఉదయం నిషిత్ ప్రయాణిస్తోన్న బెంజ్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నప్పటికి ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా కార్ల కంపెనీ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. గతంలోనే కారు బెలూన్లు తెరుచుకున్నాయా? బెలూన్లు ఓపెన్ అయితే వారి ప్రాణాలు పోవటానికి కారణాలేంటి? అనే విషయలపై బెంజ్ కంపెనీకి పోలీసులు లేఖ రాశారు. వారి నుండి జవాబు లేకపోవడంతో ఇటీవల మెయిల్ ద్వారా విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.
{loadmodule mod_custom,GA2}
దీనిపై స్పందించిన కంపెనీ.. ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు వివరాలు ఇవ్వాలని అడగడంతో పోలీసులు షాక్ అయ్యారు. రహస్యంగా ఉంచాల్సిన వివరాలు ఇవ్వడంపై పోలీసులు ఆలోచనలో పడ్డారు. ఈ విషయంను ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లగా.. వారు చెప్పినట్లు పోలీసులు నడుచుకోనున్నారు.
{youtube}5b6HNn8oIbA{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
