- Advertisement -
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిత్వం (పర్సనాలిటీ) మరియు పబ్లిసిటీ హక్కులను రక్షించాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
తన పేరు, ఫోటో, వాయిస్, వ్యక్తిత్వాన్ని అనుమతి లేకుండా ఉపయోగించడం, ముఖ్యంగా AI ఆధారిత మరియు వాణిజ్య కంటెంట్లో దుర్వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు కూడా ఇదే దిశగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, చిరంజీవి, నాగార్జున, వివేక్ ఒబెరాయ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి వారు కూడా ఇలాంటి కేసులు వేశారు.
ఇక ప్రస్తుతం మోహన్ లాల్ నటిస్తున్న దృశ్యం 3 మే 21న విడుదల కానుంది.
