- Advertisement -
బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా షూటింగ్తో బిజిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో డూప్ లేకుండగా చేశాడు. ‘సాహో’ తరువాత ఏం చేయబోతున్నారనే ప్రశ్న ప్రభాస్ కి ఎదురైంది.
అందుకాయన స్పందిస్తూ .. “ఈ సినిమా పూర్తయిన తరువాత ఏదైనా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకుంటానేమో” అంటూ ఆయన సమాధానమిచ్చాడు. ఈ సినిమా షూటింగు పరంగా జరుగుతోన్న జాప్యానికి అసహనానికి లోనైన ప్రభాస్, సినిమాలు చేసుకోవడం కన్నా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకోవడం బెటర్ అనే అర్థం వచ్చేలా చమత్కరించాడని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తుంది.