- Advertisement -
హీరోయిన్ సోనాలి బింద్రే హైగ్రేడ్ క్యాన్సర్తో బాధ పడుతున్న సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆమె న్యూయార్క్లో చికిత్స తీసుకుంటుంది. ఈరోజు తన కుమారుడు రణవీర్ పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 13వ ఏట అడుగుపెడుతున్న తన కొడుకుని పొగుడుతూ ఈ సమయంలో అతడితో లేనందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
నువ్వు 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అంటూ పోస్ట్ పెట్టింది.తెలుగులో అగ్ర హీరోలందరితోను నటించింది సోనాలి బింద్రే.సోనాలి పోస్ట్ చూసిన వారందరు ఆమె తొందరగా కోలుకోవాలని మెసేజ్ లు పెడుతున్నారు.