నితిన్ – రాశి ఖన్నా హీరో,హీరోయిన్లుగా నటించిన సినిమా `శ్రీనివాస కల్యాణం`. గురువారం నాడు విడుదలైన ఈ సినిమాకు శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు.దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితంపై దిల్ రాజు స్పందించారు. విడుదలైన మొదటి రోజు సినిమాకు యూత్ బాగా వచ్చారని,వారు మెచ్చే అంశాలు సినిమాలో లేకపోయేసరికి సినిమా వారికి నచ్చలేదని తెలిపాడు.కాని రెండో రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ థియోటర్లకు రావడం మొదలు పెట్టారని, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు.
శతమానం భవతి తర్వాత తమ బ్యానర్ లో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయని… అందుకే డివైడ్ టాక్ వచ్చిందని అన్నారు. రేపటి నుంచి ఒరిజినల్ ఆడియన్స్ థియేటర్ కు వస్తారని సినిమా బాగుందంటేనే చూసే ప్రేక్షకులు రేపటి నుంచి వస్తారని అన్నారు. ఎంతైనా తమ సినిమా ఫెయిల్ అయినప్పటికి దిల్ రాజుకు ఆశ చావడం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో కంటెంట్ లేకపోతే ఏ ఆడియన్స్ వచ్చిన ఏం చేస్తారు.