వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించింది ఓ మహిళ. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలను సీఐ ధనుంజయ గౌడ్ మీడియాకు వివరించారు.పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనిపల్లి గ్రామానికి చెందిన ధార శ్రీనయ్య భార్య వాణితో కలిసి నాలుగేళ్ల క్రితం హాలియాకు తన నివాసాన్ని మార్చాడు. హాలియాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాడు. ఈ ఇంటి పక్క గదిలోనే మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన బచ్చు వెంకట్ రెడ్డి నివాసం ఉంటున్నాడు.
దీంతో వెంకట్ రెడ్డికి, ధార శ్రీనయ్య భార్య మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయం తెలుసుకున్న భర్త ధార శ్రీనయ్య భార్య వాణిని మందలించాడు.అయినప్పటికి భార్య వాణిలో ఎటువంటి మార్పు రాలేదు.పైగా వివాహేతర సంబంధనికి అడ్డుగా ఉన్నాడని భర్త ధార శ్రీనయ్యను ప్రియుడు వెంకట్ రెడ్డితో కలిసి హత్య చేసింది.శ్రీనయ్య మృతదేహన్ని నాగార్జునసాగర్ ఎడమకాలువలో వేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తులో భాగంగా వాణి,వెంకట్ రెడ్డిలను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
\