- Advertisement -
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్లో భాగంగా వరుసగా మూడు వన్డేలు గెలిచిన టీమిండియా…. రెండు వన్డేలు మిగిలుండగానే సిరీస్ను కైవసం చేసుకుంది. సిరీస్ విజయంపై కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్విప్ చేస్తుందన్నారు.
సిరీస్ గెలవడంతో సంతోషంగా ఆటకు బ్రేక్ తీసుకుంటానని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యటనతో తీరిక సమయం లేకుండా గడుపుతున్న కోహ్లీకిసెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి రెండు వన్డేలకు కోహ్లి అందుబాటులో ఉండడం లేదు. న్యూజిలాండ్లో వన్డే సిరీస్ గెలవడం పట్ల విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నామన్నాడు. చివరి రెండు వన్డేలకు కోహ్లి స్థానంలో భారత జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నాడు