భారత సైన్యం పాక్ పై చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ గురించి మన టాలీవుడ్ స్టార్ హీరోస్ రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఉదయం పాకిస్థాన్లోకి దూసుకెళ్లి మన జవాన్లు పెద్ద ఎత్తున తీవ్రవాదులపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడులలో చాలామంది తీవ్రవాదలు మరణించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ దాడులపై మన స్టార్స్ స్పందించారు. ప్రిన్స్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తదితరులు మన జవాన్లు పాకిస్థాన్పై చేసిన దాడులపై ట్విట్ చేశారు. ఉగ్రవాదులను హతమార్చి వచ్చిన వాయుసేన దళాలపై ప్రశంసలు కురిపించారు.
మహేశ్ బాబు ఈ దాడులపై తన ట్విట్టర్లో స్పందిస్తూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను చూసి గర్విస్తున్నాను. ధైర్యవంతులైన ఐఏఎఫ్ పైలట్లకు నా సెల్యూట్ అన్నారు. ఈ దాడులపై ఎన్టీఆర్ కూడా స్పందించారు. పాక్కు మన దేశం గట్టి జవాబు ఇచ్చింది. భారత వాయుసేనకు సెల్యూట్ చేస్తున్నా అని తెలిపారు . దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ దాడులపై కామెంట్ చేశారు.సెల్యూట్ టూ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్,జై హింద్, అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు రాజమౌళి.అదేవిధాంగా రామ్ చరణ్ కూడా భారత వాయుసేనను చూసి గర్విస్తున్నా, జై హింద్ అని ట్విట్ చేశారు. ఇక మన జవాన్లు జరిపిన దాడిని అటు పాకిస్థాన్ కూడా ధృవికరించింది. ఇండియన్ ఆర్మీ తమ దేశంపై దాడి చేసిందని ప్రకటించింది. వారిపై దాడి చేసే లోపు వారు వెను తిరిగి వెళ్లిపోయారని పాక్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ దాడిలో ఉగ్రవాదులు వందల సంఖ్యలో మరణించారని సమాచారం.
- Advertisement -
సర్జికల్ స్ట్రయిక్స్పై స్పందించిన టాలీవుడ్ స్టార్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -