- Advertisement -
భుత్వం వద్ద ఉండాల్సిన పౌరుల సమాచారం ప్యివేటు సంస్థ అయిన ఐటీ గ్రిడ్కు ఎలా వెల్లిందన్న దానిపై ఏపీలో కలకలం రేపుతోంది. ఐటీ గ్రిడ్ స్కాంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. వైసీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపుకోసమే ఇదంతా టీడీపీ ప్రభుత్వం చేయిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. తాజాగా పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగల పార్టీ’ అని మరో కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. సర్వేల పేరుతో ఓటర్ల సమాచారం సేకరించారని తెలిపారు. ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి ఓట్ల తొలగింపు చేపట్టారని, ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు.